పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, దేశ రాజధానిని మరింత పచ్చగా మార్చేందుకు ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కీలక అడుగు వేసింది. బాన్సేరా వేదికగా ఆదివారం నిర్వహించిన తొలి ‘డీడీఏ గ్రీన్ ఎక్స్పో 2026’ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘డీడీఏ గ్రీన్స్’ లోగోతో పాటు, 2026 వార్షిక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.