జెనీవా వేదికగా ఇరాన్తో జరుగుతున్న రెండో విడత అణు చర్చల్లో కొంత పురోగతి లభించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన ‘రెడ్ లైన్ల’ (లక్ష్మణ రేఖల) విషయంలో ఇరాన్ ఇంకా స్పష్టమైన అంగీకారానికి రాకపోవడం చర్చలకు ప్రధాన ఆటంకంగా మారింది.